Monday, April 13, 2020

మీడియాకు వందనం

వలస పిట్టలన్నీ వరస కడుతున్నాయి, సొంత గూడు చేరాలనేమో
ఎగిరే రెక్కలు లేకపోయినా చేరగలమనే నమ్మకమేమో
అపుడెపుడో దండీ యాత్ర గురించి విన్నాను
ఇప్పుడు చూస్తున్నా, కాని ఇది తిండి యాత్ర
రోజు కూలీలను కూటి కోసం కదిలించింది కరోనా 

రోడ్లన్నీ వెలవెల బోతున్నాయ్
భేరాలు ఆడే కొనుగోలుదారులు లేరు
రేట్లు చెప్పే కొట్టువాళ్లు లేరు
వేడి వేడి పూరీలేసే బండి వాడు లేడు
అన్నా,ఇంకో ఇడ్లీ అని అడిగి తినే వాడు లేడు
బాబు కొంచెం జరుగమ్మ అని అడిగే ముసలివాళ్లు లేరు
అంకుల్ బాల్ అని అడిగే ఆటగాళ్లు లేరు
పార్కుల్లో ప్రేమికులు లేరు
సినిమా హాళ్లల్లో స్నేహితులు లేరు
మాల్లల్లో ఫామిలీలు లేరు
పాన్ డబ్బా దగ్గర పొగగాళ్లు లేరు
"బారు"లు తీరిన జనం లేరు
ఛాయి షాప్ దగ్గర ఎదురుచూసే కష్టమర్లు లేరు
ప్రయాణికుల రద్దీ లేదు
రవాణా శాఖల్లో హడావిడి లేదు

కవుల కలం మాత్రం వేగంగా కదులుతుంది, కరోనా పై అదే కదనమని
కలమే కరవాలమని భావించి
కలాన్ని కదిపిన కళకు,కళను పోశిస్తున్న మీడియాకు వందనం....

శ్వేతపుష్పం

No comments:

Post a Comment